వికలాంగుడి పాత్రలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్

వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాలని హీరోలు ఎంతగానో ప్రయత్నిస్తుoటారు. ఈ నేపధ్యంలో  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వికలాంగుడిగా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రకాష్ అనే ఒక నూతన దర్శకుడు చెప్పిన ఒక వికలాంగుడి కథ శర్వానంద్ కు బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట.

జాను సినిమా నిరాశ పరిచిన తర్వాత శర్వానంద్‌ వరుస సినిమాలు చేస్తున్నాడు. శర్వానంద్ ప్రస్తుతం పల్లెటూరి నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఫేమస్ కొరియోగ్రఫర్ రాజు సుందరం దర్శకత్వంలో మరో సినిమా తెలుగు-తమిళ భాషలో ఒకే సమయం లో చేస్తున్నారు. అలాగే ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం.