Narsipatnam: జనసేన నేత గేదె ఎర్రి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర నాయకులు

నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామానికి చెందిన జనసేన నేత గేదె ఎర్రి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ మరియు నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ రాజన్న వీర సూర్య చంద్ర మరియు సేవాదల్ కన్వీనర్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, శ్రీ సుంకు వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ శ్రీ సత్య మాట్లాడుతూ జనసేన పార్టీకి తీరని లోటని స్వగ్రామంలో పార్టీ కార్యక్రమాల కంటే విశాఖపట్నంలో భీమిలి నియోజకవర్గం సంబంధించి అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉండేవారని ఇలాంటి వ్యక్తి ఈరోజు లేరు అని చెప్పడానికి మాటలు రావడం లేదని ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియజేశారు. వీరి వెంట నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూది చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ నాయకులు నాగు, నాతవరం మండలం నాయకులు వెంకటరమణ పార్థివదేహం సందర్శించడానికి వెళ్లారు.