సీఎం మొద్దు నిద్ర వీడి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నిరాశ్రయులకు సాయం అందించాలి

రాయలసీమ కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో సీఎం జగన్ పర్యటించాలి.

జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్.

జవ్వాది తుఫాన్ బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మంగళవారం జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని, రాజధానిలో కూర్చొని సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందిస్తున్నట్లు మాటలకే పరిమితమయ్యారేగాని క్షేత్రస్థాయిలో బాధిత ప్రాంతాలలో పర్యటించలేదన్నారు… వెంటనే కష్టాల్లో నష్టపోయి ఉన్న జనాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు…. నాదెళ్ల వెంట రాష్ట్ర, జిల్లా, నాయకులు జనసేన స్థానిక నేతలు… డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, జనసైనికులు తదితరులు ఉన్నారు.