పంచాయితీ డబ్బును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దారి మళ్ళిస్తుంది..? – గల్లా తిమోతి

కృష్ణాజిల్లా మచిలీపట్నం 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లింపుపై పెద యాదర సర్పంచ్, మచిలీపట్నం జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గల్లా తిమోతి స్పందించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం ఇతర అవసరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చే కనీస సహాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు ఏమాత్రం సంబంధం లేకుండా రాజ్యాంగం ద్వారా వారికి సంక్రమించిన కనీస హక్కు, చెక్ పవర్ కాలరాస్తూ పంచాయితీ అకౌంట్ లో ఉన్న డబ్బును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏరకంగా దారి మళ్ళిస్తుందని ఎద్దేవా చేస్తారు. ఈ దుశ్చర్యపై కడప జిల్లాలో 13 మంది సర్పంచులు మీ వైసీపీ పార్టీ నుండి రాజీనామా చేశారు. అలాగే మిగిలిన సర్పంచ్లు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చర్యను రాష్ట్ర జనసేన పార్టీ సర్పంచుల ఫోరం పూర్తిగా ఖండించింది అని అన్నారు.