మగ్గాల్లో నీరు – ఆకలితో చేనేత కార్మికులు
కడప, భారీ వర్షాలు, వరదలకు జిల్లాలోని పలు గ్రామాల్లో మగ్గాల్లోకి నీరు చేరి చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చీరలు నేస్తూ వాటి మీదే ఆధారపడి జీవనం సాగించే కార్మికులు పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ మేరకు ఆయన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు లేఖ రాశారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి చేనేత కార్మికులకు తగిన ఆర్థిక సాయం అందేలా చూడాలని విన్నవించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-26-at-10.54.51-AM.jpeg)