దేశవ్యాప్తంగా పూలె విగ్రహాలు ఏర్పాటు చేయాలి: ఆకుల సుమన్

హనుమకొండ న్యూస్ అనేక సామాజిక కార్యక్రమలు నిర్వహించిన గొప్ప సంఘ సంస్కార్త జ్యోతిరావు పూలె అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ గారు అన్నారు, జిల్లా కార్యకర్తల సమావేశంలో అయిన మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు పూలె అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు. స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు అని కొనియాడారు, ఈ సందర్బంగా పూలె జయంతి వర్ధంతి అధికారికంగా ఘానంగా నిర్వహించాలని అలాగే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లలో పూలె విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసారు.