పూర్తి సమయం పార్టీ కొసమే కేటాయిస్తా- జెండా సురేష్

జనసేన పార్టీలో జనసైనికుడిగా తన ప్రయాణం ప్రారంభించిన గంగా సురేష్ బండారు ఎందరో కార్యకర్తలకు జనసేన జెండాలు లక్ష జెండాలు పంచి జెండాను ఇంటిపేరుగా మార్చుకుని జెండా సురేష్ గా మారినటువంటి నిస్వార్ద ప్రజా సేవకుడు మరియు కె ఎన్ టివి అధినేత, పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం లక్కవరం గ్రామంలో గురువారం ఆయన స్వగృహమందు శ్రీ లక్ష్మి గణపతి చండీయాగం జరిపించి పూజ అనంతరం మీడియతో మాట్లాడుతూ ఇకనుండి పూర్తి స్థాయిలో ఆయన నమ్మిన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానని మరియు పార్టీలకి అతీతంగా ఆయన దగ్గరకి ఎవ్వరు వచ్చినా వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల రాయలసీమ వరద బాధితులకు పశ్చిమగోదావరి జిల్లా జనసేనపార్టీ తరుపున పంపుతున్న నిత్యావసర సరుకులకు జనసైనికుడిగా జిల్లా కమిటీకి తనవంతు సహకారంగా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే శ్రీ గంగా సురేష్ రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శతఘ్ని న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *