జనంకోసం జనసేనలో పాటంశెట్టి సూర్యచంద్ర
జనంకోసం జనసేన 5వ రోజు
జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామంలోని రాజు చెరువు ఆయకట్టులో ఉన్న సుమారు 500 ఎకరాల భూమిని సాగు చేసే రైతులు వెళ్ళడానికి సరైన మార్గం లేదని తక్షణమే ప్రభుత్వం స్పందించి అక్కడ రైతులు పొలానికి వెళ్లి పంటను సాగుచేసి ఇంటికి తీసుకుని రావడానికి రాజు చెరువు దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేయాలని, అంతే కాక గ్రామ ప్రజలు ఎవరైనా చనిపోతే వారిని శ్మశాన వాటికకు తీసుకుని వెళ్ళే మార్గం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం దానిపై కూడా తగిన చర్యలు తీసుకొని శ్మశానవాటికకు వెళ్ళే దారి బాగుచేయ్యాలని జనసేన పార్టీ తరుపునుండి డిమాండ్ చెయ్యడం జరిగింది. గ్రామంలోని పారిశుధ్య వ్యవస్థను కూడా మెరుగుపరచాలని గ్రామ ప్రజలు తెలిపారు జనసేన నాయకులకు తెలపటం జరిగింది.