చెరుకుపల్లిలో జనసేన బహిరంగ సభ
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లిలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించే ఈ సభలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రసంగిస్తారు. గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తారు. రైతాంగాన్ని, యువతను, మత్స్యకారులను, మహిళలను, ఆపదలో ఉన్నవారిని పాలక పక్షం వంచిస్తున్న క్రమంలో వారికి జనసేన పార్టీ బాసటగా నిలుస్తుంది. ఆయా వర్గాలపట్ల జనసేన ఎంత బాధ్యతగా ఉంటుంది వివరిస్తారు. ఆదివారం మధ్యాహ్నం నారా కోడూరు నుంచి మొదలయ్యే ర్యాలీ కట్టెంపూడి, పొన్నూరు, నిడుబ్రోలు, చందోలు మీదుగా చెరుకుపల్లికి చేరుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై శ్రీ నాదెండ్ల మనోహర్ తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సమన్వయకర్త శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీ నయాబ్ కమల్, శ్రీ వడ్రాణం మార్కండేయబాబు, శ్రీ బేతపూడి విజయశేఖర్, శ్రీ జిలానీ, శ్రీ అమ్మిశెట్టి వాసు, జిల్లా కార్యవర్గం చర్చించారు. ఈ సభ ద్వారా జనసేన పార్టీ ప్రజల కోసం ఎంత బలంగా నిలబడుతోందీ, ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందుతోందీ తెలియచేద్దామని శ్రీ మనోహర్ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-04-at-7.42.37-PM-723x1024.jpeg)