ఖాదర్ బాబా వారి దర్గాను సందర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి

సూఫీమహాత్మా హాజరత్ అతావుల్లా షరీఫ్ షా ఖాదర్ బాబా(చీమల పాడు బాబా) దైవైక్యం అనంతరం వారి కుమారులు డా. ఖలీలుల్లా షరీఫ్ మరియు వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఉదయం బాబామెట్ట ఖాదర్ వలి దర్గా మరియు ధర్బార్ షరీఫ్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పరామర్శించారు. ఈసందర్భంగా ఆమె ఖాలీల్ వారిని ఓదారుస్తూ… నిత్య అన్నదాత, సూఫీ మహానుభావులు హాజరత్ అతావుల్లా బాబా కారణ జన్ములని, వారి సేవలను, ఆశయాలను కొనసాగించడానికి భగవంతుడు ఖలీల్ బాబుకు శక్తిసామర్ధ్యాలన ఇవ్వాలని కోరుకుంటూ గత మూడు రోజులగా హాజరత్ అతావుల్లా బాబా వారి పేరుమీద రోజుకు సుమారు రెండు వేల మందికి అన్నదానం చేస్తున్న ఖలీల్ బాబాను అభినందించారు. జనసేన ప్రధాన కార్యదర్శి యశస్వితో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), కిలారి ప్రసాద్, నాయుడు, చందు పాల్గొన్నారు.