ఒంగోలులోని జనసేన పార్టీ కార్యలయంలో అంబేద్కర్ కు ఘననివాళి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 65వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి కాటం అశ్విని మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత మహనీయులు అంబేద్కర్ వారు అని, ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కులం పునాదుల మీద ఏమి సాంధించలేరని రాజ్యాంగంలో నాడు కల్పించిన పౌర హక్కులు ఏనాటికీ ప్రజలకు రక్షణగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువనాయకులు చెల్లూరి ముత్యాలనాయుడు, జడ్డు జనార్ధన్, సాయి కిరణ్, లెంక నాగార్జున, కిలారి వినయ్, లోకేష్, ఎ.శివ గణేష్, రాగోలు సాయి కిరణ్ పాల్గొన్నారు.