విశాఖపట్టణం నుండి శబరిమల సైకిలుపై బయలుదేరిన జనసైనికుడు

విశాఖ జిల్లా, భీమిలి నియోజకవర్గం 5వార్డ్ మధురవాడ శివశక్తి నగర్ వాస్తవ్యులు ఇమ్మంది శ్రీనివాస్ స్వామి సైకిల్ మీద శబరిమలై యాత్రకి 13-12-2021 తేదీన బయల్దేరారు. 13-1-2022 నాటికి శ్రీ స్వామివారి శబరిమల సన్నిధానం చేరుకుంటారు. అలాగే తన అభిమాన నటుడు… ప్రజా నాయకుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని సంకల్పంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నానని చెప్పారు. నీతి నిజాయితీకి మారు పేరు అయిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ప్రజలకి మంచి జరుగుతుందని అన్నారు. జనసేన పార్టీ భీమిలీ నియోజకవర్గం ఇంచార్జ్ డా. శ్రీ సందీప్ పంచకర్ల సూచనల మేరకు శ్రీనివాస్ స్వామికి అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనిక్లు మరియు కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీనివాస్ స్వామికి వసతి సౌకర్యాలు కల్పించాలని మధురవాడ జనసేన కోరుతున్నట్లుగా తెలిపింది.