శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆంధ్రరాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. ఆయన వర్ధంతి సందర్భంగా వాడపాలెం గ్రామం బజార్ వీధిలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బండారు శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ శ్రీకాకుళపు భీమేశ్వరరావు, శ్రీకాకుళపు వీరబాబు, పచ్చిపులుసు తాతారావు, సుతాపల్లి అబ్బి, పచ్చిపులుసు గుప్తా, 11 వార్డ్ నెంబర్ నాగ శ్రీను మరియు గ్రామ జనసేన కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.