శ్రీ పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన జనసైనికులు

నూజివీడు నియోజకవర్గం, అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ముసునూరు మండలంలోని రమణక్కపేట సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి ఆయన త్యాగం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అని నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేట త్రినాథ్, పవన్, సూర్య, గుండాల శివ తదితరులు పాల్గొన్నారు.