విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపైన్ లో గాజువాక జనసేన

గాజువాక, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాన్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాత గాజువాక జంక్షన్ దగ్గర గాజువాక జనసేన శ్రేణులు ప్లకార్డుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ గడసాల అప్పారవు, గాజువాక జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు, 64వ వార్డు కౌన్సిలర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.