మాడుగుల నియోజకవర్గం అంతటా విశాఖ ఉక్కు సెగ

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు మాడుగుల నియోజకవర్గం అంతటా భారీగా ప్లకార్డులు తో నిరసన కార్యక్రమాలు చేపట్టారు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. మాడుగుల నియోజకవర్గం పరిధిలో ఉన్న వి.మాడుగుల, దేవరాపల్లి, కే. కోటపాడు, చీడికాడ, అయినటువంటి అన్ని మండలాల్లో “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అని జనసైనికులు భారీగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకేరోజులో నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి పలు రకాల నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్, రోబ్బా మహేష్, వీరా సురేఖ, దయా యాదవ్, గండ్రెడ్డి శివాజీ, త్రినాథ్, అంజి, మూర్తి, యన్నంశెట్టీ సీతారాం, కలిపిరెడ్డి రాజా, దాసరి అచ్యుతరావ్, కోళ్ల చిన్న, రాము,అప్పి, నానాజీ మరియు అన్ని మండలాల జనసైనికులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలిపారు.