“విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” డిజిటల్ క్యాంపెయిన్ లో మగటపల్లి జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-10.17.02-PM-1024x461.jpeg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మగటపల్లి జనసైనికులు ప్లకార్డులతో నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల నాయుడు, దొడ్డ జైరామ్, బొలిశెట్టి ధర్మ, నామన రాజేష్ మరియు ఆచంట మణికంఠ పాల్గొన్నారు.