బూరయ్య కుటుంబానికి భరోసా ఇచ్చిన బండారు శ్రినివాస్

కష్టాల్లో ఉన్న వారిని ఆత్మీయతతో ఆదరించే గొప్ప మనసున్న నాయకుడు! బండారు శ్రీనివాస్ జనసేన నేత అని! హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు మరియు జనసైనికులు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలంలోని, మెర్లపాలెం పాలెం గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా మెర్ల బూరయ్య కుమారుడు మెర్ల సతీష్ మరణించారు. వీరి కుటుంబ సభ్యులను బుధవారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ తన అనుచరులు, జనసైనికులు, నాయకులుతో కలిసి సతీష్ తండ్రి బూరయ్యను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీరి వెంట పలువురు జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు, కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండే వాడే గొప్ప నాయకుడని, అధికారం ఉన్నా, లేకపోయినా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే మంచి మనసున్న వాడే నిజమైన నాయకుడని, అతడే జనసైనికుడని, ఈ సందర్భంగా పలువురు బండారు శ్రీనివాస్ ను కొనియాడారు.