వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

మచిలీపట్నం, జనసేన పార్టీ కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంనందు కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ మరియు జనసేన పార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ వేల్పురి నానాజీ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండల అధికార వైకాపా పార్టీ నాయకులు వీరంకి వెంకయ్య, ఉతుకూరు గ్రామ సర్పంచ్ సుడాబత్తుల శ్రీనివాసరావు, మిరియాల రవితేజ, పుప్పాల సాంబశివరావు, ముత్యాల మణికంఠ జనసేన పార్టీ సిద్ధాంతాలు శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన పార్టీ లో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు దూసనపుది బ్రహ్మాజీ, మోతేపల్లి హనుమ, పోకుల కృష్ణ, అంబుల భరత్, వాలిశెట్టి బాబీ, మల్లంపల్లి వీరబాబు, కురుచేతి నాగేంద్ర, సత్యవోలు గణేష్, రవితేజ, జనసైనికులు పాల్గున్నారు.