లూసిఫర్ తెలుగు రీమేక్‌పై చర్చ

చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 151 వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు డైరెక్ట్ చేసిన వివి వినాయక్ త్వరలోనే చిరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడాని టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా చిరంజీవి, వివి వినాయక్ ఇద్దరి మధ్య లూసిఫర్ తెలుగు రీమేక్‌పై చర్చ జరిగినట్టు మాత్రం ప్రచారం జరుగుతోంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. తాజాగా అదే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉన్న ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను చిరు వినాయక్ చేతుల్లో పెట్టినట్టు ఫిలింనగర్ టాక్.

లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం మొదట్లో సాహో ఫేమ్ సుజీత్ రెడ్డిని ఎంపిక చేసుకున్నట్టు తెలిసినప్పటికీ.. ఆ తర్వాత సుజీత్‌ని కాకుండా మరో డైరెక్టర్ కోసం వేటలో పడినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఐతే ఫైనల్‌గా ఆ చిత్రం కోసం ముచ్చటగా మూడోసారి వివి వినాయక్నే నమ్ముకున్నట్టు సమాచారం. ఇందులో నిజం ఎంత అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు.