జనసేన పార్టీ లోకి పెరుగుతున్న వలసలు

విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యారావు, వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ల సమక్షంలో చేతుల మీదుగా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల మండల పరిధిలోని వమ్మలి పంచాయతీ నుంచి తాటికొండ రామకృష్ణ మరియు సాగరం పంచాయతీ నుంచి పాము నాగరాజు, శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకుని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాఒతాలు నచ్చి జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేసి ప్రజల సమస్యల కోసం పోరాడే వారు ఎవరైనా జనసేన పార్టీలోకి వస్తే హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తామని మాడుగుల నియోజకవర్గ జనసైనికులు ఈ సందర్భంగా చెప్పారు. రానున్న రోజుల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి అని మాడుగుల నియోజకవర్గ జనసైనికులు తెలిపారు.