నూతనంగా ఏర్పడిన మండల కమిటీ సమావేశం నిర్వహించిన మార్కాపురం జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గంలోని, తర్లుపాడు మండలంలో జనసేన పార్టీ నూతనంగా ఏర్పడిన మండల కమిటీ సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ మార్కాపురం ఇన్చార్జి ఇమ్మడి కాశీనాధ్. మొదట తర్లుపాడు పట్టణంలోని మెయిన్ సెంటర్ వద్ద నుంచి సభ వేదిక వరకు భారీ బాణసంచా, డప్పు వాయిద్యాలు నడుమ అడుగడుగునా పూలమాలలు, హారతులతో కార్యకర్తలు ఇమ్మడి కాశీనాధ్ కి ఘనస్వాగతం పలికారు. జనసేన పార్టీ తర్లుపాడు మండల అధ్యక్షుడిగా చేతుల శ్రీనివాస్ ను, మండల ఉపాధ్యక్షులుగా సూరె సువర్ణ, మండల కార్యదర్శిగా బూదాల కాశయ్య, మండల సంయుక్త కార్యదర్శిగా షేక్ రసూల్ ని, సభ్యులుగా పి.రాంబాబు, టి.నాగరాజు, జి.శ్రీను, జి.మోషే, చి.శివ కాశి నారాయణ, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ ముందుగా మండల కమిటీలు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల్లో పార్టీ ఎప్పుడైతే సంస్థాగతంగా దృఢంగా ఉంటుందో అప్పుడే రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. మరియు రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంత క్రియాశీలకంగా వ్యవహరించబోతుందో మరియు రాబోయే ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శి N.V. సురేష్, బిన్నబోయిన శ్రీనివాస్, వెంకటయ్య , ఇమ్మడి శ్రీనివాసులు, సంగటి వేంకటేశ్వర్లు, పిచ్చయ్య, తిరుపతయ్య మరియు మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.