ప్రభుత్వ విధానాల తీరును ఎండగట్టిన బండారు శ్రీనివాస్

జనసేనపార్టీ నాలుగు మండలాల అధ్యక్షుల అభినందన సభ.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ జనసేన పార్టీ కొత్తపేట కార్యాలయం దగ్గర మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు జనసేన పార్టీ అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారని, ఈ ఎన్నికకు ఏకగ్రీవంగా జనసైనికులు ఆమోదంతో, జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే బలమైన నాయకులుగా వీరి నలుగురిని నాయకత్వం ఉంటుందని తెలియజేశారు. ఆలమూరు మండలం నుంచి సూరపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షులుగా, రావులపాలెం మండలం నుంచి తోట స్వామి అధ్యక్షులుగా, కొత్తపేట మండలం నుంచి అంబటి పరమేశ్వరరావు అధ్యక్షులుగా, ఆత్రేయపురం మండలం నుంచి చేకూరి కృష్ణంరాజు జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారని వారికి అభినందన సభ ద్వారా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేస్తూ అభినందించినారు, వీరంతా నూతన ఉత్తేజంతో జనసేన పార్టీ ముందుకు నడిపిస్తారని తెలియజేసినారు. అనంతరం బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల్లో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ప్రజల హృదయాల్లో నిలిచిందని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ దూకుడు, జనసైనికుల ఉత్సాహము కలిపి, ఎన్నికలలో జనసేనానిని విజయం సాధించాలని, బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనానినీ ఎదుర్కొనే ధైర్యం లేక జనసేనాని ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టాలని, జనసేనానిని ప్రజల నుంచి దూరం చేయాలనే అనేక కుట్రలు పన్నినా ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ లెక్కచేయలేదని, ప్రభుత్వానికి సవాలు విసురుతూ, ప్రభుత్వ పాలన మీద వివిధ పథకాలపై, ప్రజలపై నడ్డివిరిచే పన్నుల బాదుడు కార్యక్రమాలపై విరుచుకుపడ్డారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు ప్రజల్లో మొదలైందని, జనసేనానికి అండగా ప్రతి ఒక్కరూ ఈ రోజున తండోపతండాలుగా జనసేన పార్టీ వైపు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఆకర్షితులవుతున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్ల డేవిడ్, పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శితో పలువురు హాజరయ్యారు.