నర్సీపట్నం జనసేన ఆధ్వర్యంలో 2022 క్యాలెండర్ ఆవిష్కరణ

నర్సీపట్నం, నారాయణ రాజు పేట జనసేన టీం సహాయ సహకారాలతో నర్సీపట్నం జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర అధ్యక్షతన నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో 2022 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడినటువంటి క్యాలెండర్ ను అందించినటువంటి నారాయణ రాజు పేట జనసేన టీం వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అత్యంత సేవాభావం కలిగినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వీటితో పాటుగా సహాయ సహకారాలు చేయడంలో ముందున్న పార్టీ జనసేన పార్టీ అని నారాయణ రాజు పేట కర్రీ చిరంజీవి తన స్వగ్రామం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఉపాధి నిమిత్తం విదేశాలలో ఉంటూ కూడా జనసేన పార్టీ పై తన కర్తవ్యం నిర్వహిస్తున్నారని తన పార్టీపై ఉన్నటువంటి సేవాభావాన్ని గుర్తుగా 2002 క్యాలెండర్ ముద్రణ చేయించి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి జనసైనికులకు వితరణ చేయమని నారాయణ రాజు పేట జనసేన టీం తరఫున పంపిణీ చేయించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూది కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ చిరంజీవి, వెలగా అప్పలనాయుడు, లోకిన రామకృష్ణ, మోపడ చిరంజీవి, ఎర్ర ఈశ్వరరావు, సఖిరెడ్డి సత్తిబాబు మాస్టర్, చెల్లూరి గుణశేఖర్, లోకిన జ్యోతి, లోకిన రామకృష్ణ, దుబాసి అచ్చయ్య నాయుడు, ఉగ్గిన రమణ, ఎన్నం రామచంద్ర, కర్రీ శ్రీను, పరవాడ శ్రీనివాసరావు, మొపద వంశీ, అగ్రహారం గోవింద్, మటఒ దుర్గాప్రసాద్, షేక్ ఇస్మాయిల్, వెంకటరమణ, ఆధార జగన్, పాతాళ శివ, గంగుల స్వామి, అప్పన్న రాజేష్, శనివార రవి, బిళ్ళకు చరణ్ తదితరులు పాల్గొన్నారు.