అగ్నిప్రమాద బాధితులకు అండగా అమలాపురం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-30-at-8.19.11-PM.jpeg)
ఉప్పలగుప్తం మండలం వాడపర్రు పంచాయతీలో గల ఇంద్రనగర్ నందు 17/12/2021 అగ్ని ప్రమాదం వల్ల గుర్రాల అక్కురాజు, నాగరాజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు ఇళ్లు పూర్తిగా తగలబడి పోవడం వల్ల రెండు కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు.పేదలు ఆపదలో ఆదుకోవడం ముందు వరుసలో ఉన్న జనసైనికులు 18 వ తారీఖున పదివేల నగదు 50 కేజీల బియ్యం అందించారు. జనసేన దళిత నాయకులు శ్రీ ఇసుకపట్ల రఘుబాబు నేతృత్వంలో వేదాంత సంస్థ యాజమాన్యంతో మాట్లాడి 30 వేల ఖరీదు చేసే బట్టలు, వంట సామాగ్రి, నిత్యవసర సరుకులు, మంచాలు, బియ్యం పెట్టి, బట్టలు పెట్టితో సహా రెండు కుటుంబాలకు అవసరమైన అన్ని వస్తువులు స్థానిక గొల్లపల్లి సర్పంచ్ శ్రీమతి జొన్నాడ దుర్గ, కూనవరం సర్పంచ్ వాకపల్లి ఈశ్వరి, ఎంపిటిసి దొనిపటి బాలమణి, జనసేన పెద్దలు యాళ్ళ నాగసతీష్, లింగోలు పండు, డాక్టర్ నాగమానస, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బట్ట పండు, పోలిశెట్టి కన్న, కిషోర్, నల్లా వెంకటేశ్వరరావు, కుసుమ వెంకన్న, సుభాష్ చంద్రబోస్, సుంకర లక్ష్మణ్ మరియు జన సైనికుల గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఇసుకపట్ల రఘుబాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా జనసైనికులు ఎప్పుడు పేదల కష్టాల్లో ముందుంటారని, శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయసాధనలో ముందు ఉంటారని మనవి చేస్తూ ఈ సహాయం అందించిన వేదాంత యాజమాన్యంకు ధన్యవాదాలు తెలిపారు.