ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యమని 2022వ, సంవత్సరానికి స్వాగతం పలికిన రాజంపేట జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-01-at-3.45.03-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-01-at-3.45.03-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-01-at-3.45.02-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-01-at-3.45.02-PM-1024x768.jpeg)
రాజంపేట జనసేన పార్టీ ఆఫీస్ లో 2022 నూతన సంవత్సరానికి ప్రజాసమస్యలను పరిష్కారాల విజయముతో స్వాగతం పలుకుతూ, శ్రీ పవన్ కళ్యాణ్ కి, ప్రజలందరికి ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ స్వాగతం పలికారు. చాలా సంతోషమైన విషయం దాదాపు 3 సంవత్సరాల నుంచి కళ్ళులేని వ్యక్తికి రాజంపేట మండలానికి చెందిన తాళ్ళపాక శంకరయ్య పోరాడి శనివారం అతను పించను అందుకున్న ఆనందాన్ని పార్టీ ఆఫీస్ లో పంచుకున్నారు. అదే విధంగా సిద్దవటం రాటాల రామయ్య ఒక ముసలావిడకి పింఛను ఇప్పించినట్టు ఆమె తెలియజేశారు. ఇలా జనసేన ప్రజా సమస్యలను పరిష్కరించి 2021ని విజయాలతో సాగనంపి 2022ని రెట్టింపయిన ఉత్సాహముతో పనిచేస్తామని స్వాగతము పలుకుతున్నామని… ప్రతి జనసేన కార్యకర్తకు, జనసైనికునికి ప్రత్యేక ధన్నవాదములు తెలిపారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర చేనెత విభాగ కార్యదర్శి రాటాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్ష్యులు కత్తి సుబ్బరాయుడు, తీళ్ళపాక శంకరయ్య, బండ్ల రాజేష్ మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.