పార్టీ బలోపేతం గురించి సమావేశమైన సెట్టూరు మండల జనసేన

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం ఎస్సైని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సెట్టూరు మండలం కన్వీనర్ వీరన్నని పరిచయం చేసిన జిల్లా కార్యదర్శి శ్రీ లక్ష్మీ నరసయ్య. అనంతరం జనసైనికులతో సమావేశమై జనసేన పార్టీ బలోపేతం గురించి డిస్కషన్ చేసి, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చెయ్యాలని మండల పరిధిలోని జనసేన నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెట్టూరు మండల కన్వీనర్ వీరన్న, శ్రీనివాసులు, రామలింగ, వెంకటేష్, ఎర్రి స్వామి, రమేష్, కళ్యాణదుర్గం జనసేన నాయకులు రాజు, సాయి, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.