దాసం రాంబాబు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిచ్చిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో శ్రీవిద్య కాన్వెంట్ ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ మరియు జనసేన నాయకులు అయిన శ్రీ దాసం రాంబాబు మాస్టారు తల్లి దాసం ప్రభావతి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, గారపాటి చంటిబాబు, అవ్వారి రమేష్, అడబాల వీర్రాజు, దాసం కొండబాబు, అడప నూకరాజు, గోకనకొండ బుజ్జి, p.s n.మూర్తి, యండ్రపు శ్రీనివాస్, సి.హెచ్ శిరీష, తదితరులు పాల్గొన్నారు