కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమరునిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-06-at-8.57.44-PM.jpeg)
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, వనమా రాఘవ్ బెదిరింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలని, తక్షణమే MLA కుమారునిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శంకర్ గౌడ్ స్పందిస్తూ ప్రతినిధుల ముసుగులో ఇటువంటి ఘటనలకు కారణమైన వారిపై తక్షణమే చర్యలుతీసుకోవాలని , ఘటనపై సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు వారిపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.