సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా ప్రజాసేవలో జనసేన పార్టీ వీరమహిళ గీతాంజలి

సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండల దొరవారిసత్రం హైస్కూల్ నందు నెల్లూరు రెడ్ క్రాస్ వారి సహకారంతో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం యువ నాయకుడు బురకాల లీలామోహన్ మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం మహిళా నాయకురాలు బురకాల గీతాంజలి, దొరవారిసత్రం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు సనత్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జిల్లా సంయుక్త కార్యదర్శి లీలా మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా 40 మంది రక్త దానం చేశారు మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసిన జనసైనికులకు మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య, మునిరాజా, నరేంద్ర, శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు.