నాగిరెడ్డిపల్లి జనసేన ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం

కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ తోటపాలెం దగ్గర ఉన్న జోసెఫ్ స్కూల్ దగ్గర జనసేన ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం కోసం వేచి చూసి నిరాశ పడిన తోటపాలెం ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన హామీ నెరవేర్చారు.
ప్రభుత్వం చేయలేని పని కూడా జనసేన పార్టీ నందలూరు కార్యకర్తలు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో నందలూరు జనసైనికులు నాగ ఆర్య, ప్రకాష్, అవుల సాయి, నడిగడ్డ ప్రశాంత్ భారతల, మండెం రాము, తిప్పయపల్లి ప్రశాంత్, ఆడపుర్ శ్రీకాంత్, టంగుటూరు ఈశ్వర్, టంగుటూరు కళ్యాణ్, నడిగడ్డ గురుసాయి, నరసింహ,బాలు, గురివిగారి వాసు, తోటపాలెం జోసెఫ్ స్కూల్ పిల్లలు, సుబ్బు, మంకు వెంకటేష్ పాల్గొనటం జరిగింది.