జనసేన పార్టీలో 10 కుటుంబాల చేరిక

అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ వీరి ఆదేశాల మేరకు అమరాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో అమరాపురం మండల పరిధిలోని వీ.అగ్రహారం పంచాయితీ నుండి 10 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. నవీన్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే నవీన్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ మండలంలో బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకొని వెళ్లాలని అలాగే అందరూ కలిసి బాగా పని చేయాలని ఆయన అన్నారు.