సంక్రాంతి శుభాకాంక్షలు పితాని బాలకృష్ణ ముమ్మిడివరం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-15-at-10.05.23-PM.jpeg)
తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ సంక్రాంతి, కనుమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు, నా అక్క చెల్లెమ్మలకు, నా ఆడపడుచులకు, అన్ని వర్గాల వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు సోదరులకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నన్ను ఎంతగానో ఆదరించి నా అధినాయకుడు, మానవత్వం కలిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన, ఒక గొప్ప నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుని, నాయకత్వంలో ప్రయాణం చేస్తున్నందుకు మేమెంతో గర్వపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపటి రాబోయే రోజుల్లో ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించాలని, ఒక్క అవకాశం ఇస్తే, నా అధినాయకుడు జనసేనాని, కులమత బేధాలు లేకుండా, అన్ని వర్గాల ప్రజలకు అందరికీ న్యాయం చేయగలరని, నీతివంతమైన పరిపాలన అందించగలరని, రాష్ట్ర ప్రజల కష్టసుఖాలను నిరంతరము పాలు పంచుకుంటూ, ముందుకు సాగుతారని, రాష్ట్ర యువత భవిష్యత్తుకు, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి కాపాడగల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని, స్వార్థం లేని నాయకుడిగా, గొప్ప పరిపాలనాదక్షుడుగా రాష్ట్ర ప్రజలంతా సహకరిస్తే చరిత్రలో మిగిలి పోయే పరిపాలన అందించగలిగే ముఖ్యమంత్రిగా రేపటి తరానికి గొప్ప నాయకత్వాన్ని అందిస్తారని, నన్ను ఎంతో ఆదరించిన, నా ప్రియమైననేత జనసేనానికి, అన్ని వర్గాల వారికి, జనసైనికులకు, జిల్లా ఇన్చార్జి, మా లెజెండ్ కందుల దుర్గేష్ కు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందజేస్తున్నానని, ఈ సందర్భంగా ఘనంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేశారు.