జాతీయ విద్యా విధానం దేశాన్ని నాలెడ్జ్ పవర్‌హౌస్‌గా మారుస్తుంది

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధానం దేశ విద్యా వ్యవస్థలో నూతన శకానికి నాంది అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి పాల్గొన్న గవర్నర్ల సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు అనివార్యమని, ఈ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. జాతీయ విద్యా విధానం తెలంగాణ వంటి కొత్త రాష్ట్రానికి ఒక వరమని గవర్నర్ తమిళి సై సౌందరాజన్ అభిప్రాయపడ్డారు. ఇది దేశ విద్యా కేంద్రంగా ఉద్భవించే అవకాశం ఉందన్నారు. కొత్త విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎక్కువ సమన్వయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్లుగా భారతదేశాన్ని నాలెడ్జ్ పవర్‌హౌస్‌గా మారుస్తుందని ఆమె తెలిపారు. 21వ శతాబ్దానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ప్రపంచ పౌరులకు బలమైన భారతీయ మూలాలతో శిక్షణ ఇవ్వడానికి వీలు కల్పిస్తుందన్నారు. బహుళ క్రమశిక్షణా విధానం ద్వారా ఆవిష్కరణ పరిశోధనలను ప్రోత్సహిస్తుందని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.