నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రీమతి శేషు కుమారి

జనసేనానిని సీఎం చేసే విధంగా మనం కష్టపడదాం: మాకినీడి శేషు కుమారి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి శేషు కుమారి జనసేన పార్టీ నూతన కార్యాలయం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి, జనసేన పార్టీ తరపున సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఆడపడుచులు వీరమహిళలతో రంగుల ముగ్గుల పోటీల కార్యక్రమానికి జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే శేషుకుమారి మాట్లాడుతూ గొల్లప్రోలు మండలానికి దుర్గాడ చేబ్రోలు అలాగే కొన్ని గ్రామాలు ఎంతో బలంగా ఉంటాయని ఈ కార్యాలయాన్ని పండగ వాతావరణంలో ప్రారంభించే పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం గ్రామ ఆడపడుచులు ముగ్గుల పోటీ మా హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ నేను జనసైనికులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని… అలాగే పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఆశయాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని చేసే విధంగా అందరూ కృషి చేయాలని ప్రతి జన సైనికుడు, వీరమహిళలు, కార్యకర్తలను కోరుకుంటున్నానని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, మొగిలి శ్రీనివాస్, కొప్పన రమేష్, ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, శాఖ సురేష్, వెలుగుల లక్ష్మణ్, సకినాల త్రిమూర్తులు, సకినాల రాంబాబు, మొగిలి అర్జునరావు, సకినాల అప్పన్న, ఎండపల్లి కన్నారావు, బొమ్మిడి రమేష్, శాఖ సురేష్, తోట ఏసయ్య, తోట దొంగోడు, తోట శ్రీను, తోట బాబ్జి, గొల్లపల్లి శ్రీనివాస్ వినుకొండ అమ్మాజీ, వాకపల్లి సూర్య ప్రకాష్, అడప శివరామకృష్ణ, గంజి గోవిందరాజు, రామిశెట్టి సూరిబాబు, మేళం బాబి, యండపు శ్రీనివాస్, సి.హెచ్ శిరీష, సి.హెచ్ నవీన్, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.