కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడండి: జనసేన బాడిశ మురళీకృష్ణ

కృష్ణాజిల్లా, కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడీశ మురళీకృష్ణ పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యాసంస్థలకు కనీసం ఈ నెలాఖరువరకు సెలవులు ప్రకటిస్తేనే విద్యార్థులను ఈ మహమ్మారి నుంచి కాపాడుకోగలమని రాష్టంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేసులు పెరిగినప్పుడు చూద్దాంలే అని భాద్యతారాహిత్యంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమని విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా దూరదృష్టి లేదని అర్ధమవుతుందని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాసంస్థలని ముసివేసి ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తుంటే ఆ మాత్రం కూడా భాద్యత లేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమని ఇప్పటికైనా పునరాలోచన చేసి కనీసం ఈ నెలాఖరువరకైనా సెలవులు ప్రకటించి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.