ప్రభుత్వ స్కూల్స్ ను సందర్శించిన పాలవలస యశస్వి

కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించకపోవడంతో, ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలలో కరోనా నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించడానికి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం కార్యదర్శి అశ్విని, 9వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి హుసేన్ ఖాన్, 9వ డివిజన్ లో గల కస్పా హైస్కూల్ ను సందర్శించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాలు, చక్రవర్తి, రవితేజ, రవిరాజ్ చౌదరి, యోగేష్, పిడుగు సతీష్, ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.