కూకట్పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవం

కూకట్పల్లి జనసేన పార్టీ ఆద్వర్యంలో రమ్య గ్రౌండ్ మరియు టెంపుల్ బస్ స్టాప్ వద్ద 73వ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జెండా వందనం అనంతరం 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్లా శంకర్, 115 డివిజన్ ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్ ఇరువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పుణ్య ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం అని అలాగే డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే ఆయన ఆశయాలను నేరవేర్చే దిశగా యువత ముందుకు వెళ్లాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ నాయకులు 114 డివిజన్ కొల్లా శంకర్, 115 ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్, 115 ప్రధాన కార్యదర్శి తుమ్మల మోహన్ కుమార్, 114 డివిజన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ మరియు జనసైనికులు అంజి(కేబుల్), సత్యనారాయణ, ఉదయ్, శంకర్, నాగరాజు, వెంకటేశర రావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.