జనసేన పి.ఎ.సి. సభ్యునిగా చేగొండి సూర్యప్రకాష్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-7.21.43-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-4.48.53-PM-723x1024.jpeg)
*నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లకు అధ్యక్షుల నియామకం
జనసేన పార్టీ కమిటీలలో మరికొన్ని నియామకాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. పార్టీలో అత్యున్నతమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చేగొండి సూర్యప్రకాష్ గారిని సభ్యునిగా నియమించారు. అదే విధంగా కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి నగరాలకు అధ్యక్షుల్ని నియమించారు. సంగిశెట్టి అశోక్ (కాకినాడ), యర్నాగుల శ్రీనివాసరావు (రాజమండ్రి), మలగా రమేష్ (ఒంగోలు), జగదీష్ రాజారెడ్డి (తిరుపతి)లను నగర అధ్యక్షులుగా నియమించారు.