పోరాటాల పురిటిగడ్డ మార్కాపురం జిల్లా చేయాలని జనసేన డిమాండ్

మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి ఐదు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా చేయాలని అఖిలపక్ష సమావేశంలో ఎలా పోరాటం చేయాలో కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందరు కూడా ముక్తకంఠంతో పోరాటం చేద్దామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్, గిద్దలూరు జనసేన ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా, దర్శి జనసేన ఇన్చార్జి బొట్టుకు రమేష్, జనసేన జిల్లా కార్యదర్శి నరసింహ, జనసేన జిల్లా సహాయ కార్యదర్శి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి బాల రంగయ్య మరియు టిడిపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.