కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారికి అండగా, ధైర్యం చెబుతున్న బండారు

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలం నందు, నర్సిపూడి గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ ఇన్చార్జి కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ నాయకులు బండారు శ్రీనివాస్ పర్యటించారు. నర్సిపూడి గ్రామానికి చెందిన తెలగరెడ్డి సతీష్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన కారణంగా, వారి కుటుంబ సభ్యులను కలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కుటుంబ వ్యక్తి లేని బాధ, ఎంతో తీరనిలోటని, కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎంత ఓదార్పుగా, ఎంతో ఆత్మీయతతో బండారు శ్రీనివాస్ పలకరించి మనోధైర్యాన్నిచ్చారు. వీరి రాక సందర్భంగా పలువురు గ్రామస్తులు వచ్చి, బండారు శ్రీనివాస్ ను, మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. వీరి వెంట గ్రామ, మండల జనసైనికులు, కార్యకర్తలు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.