నందిగామ నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కమల్ కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఒడిశా మురళీ కృష్ణ, పండ మనేని శ్రీనివాసరావు, బత్తిన హరిరామ్, జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి పుట్టా స్వరూపా, ఈమని కిషోర్ కుమార్ మరియు నందిగామ నియోజకవర్గ నాలుగు మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీకాంత్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రతి ఒక్క జనసైనికులను, నాయకులను కలుపుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ ప్రయాణం జరగటానికి అందరూ సహకరించాలని కోరారు.