కర్నూలు జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు నామకరణం చెయ్యాలి

విజయవాడ కి ఎన్.టి.ఆర్ జిల్లా పేరు పెట్టినపుడు..
కడపకి వైఎస్సార్ జిల్లా పేరు పెట్టినపుడు..
కర్నూలుకి దామోదరం సంజీవయ్య(దళిత ముఖ్యమంత్రి) పేరు ఎందుకు పెట్టలేదు…?

కొత్త జిల్లాలపై వైఎస్సార్సీపి ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదన వెనక్కి తీసుకుని, కర్నూలు జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు నామకరణం చెయ్యాలి, దళితులను అడ్డంపెట్టుకుని నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపి ప్రభుత్వం, మాజీ దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారినే విస్మరించింది, అలాంటిది సామాన్య దళితులకు ఏ విధంగా న్యాయం చేస్తుంది దళితులందరూ ఆలోచించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కర్నూలు జిల్లాకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన విధంగా దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వైఎస్సార్సీపి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ దళిత నాయకులు దోమకొండ అశోక్ డిమాండ్ చేయడం జరిగింది.