జనసేన నాయకులను అరెస్టు చేయడం దారుణం: పోలిశెట్టి శ్రీను

రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి పౌరునికి నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసేందుకు నిరసనగా జనసేన నాయకులు ర్యాలీలు చేపడుతుంటే వైసీపీ ప్రభుత్వం జనసేన నాయకులను పోలీసులు ద్వారా అరెస్టు చేయించడం చాలా దారుణమన్నారు. రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రజల ఓట్లతో గెలిచి రాజంపేటకు ఇంత అన్యాయం జరుగుతుంటే పదవుల్లో ఉన్న నాయకులు కనీసం నోరు మెదపక ఉంటే జనసేన నాయకులు నిరసన చేస్తే వారి పైన కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారి మీద కేసులు ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.