ప్రమాదంలో గాయపడ్డ జనసేన కార్యకర్తకు ఆర్థిక సహాయం
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్త ఎనుముల నారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు ఎనుముల నారాయణను కలిసి పరామర్శించారు. అనంతరం ఆయనకు ఐదు వేల రూపాయల వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య, కంభం మండలం అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ చేతులు మీదుగా 5,000 ఆర్ధిక సహాయం అందించారు. అలానే జనసేన కార్యకర్త నారాయణకు ఇన్సూరెన్స్ కంపెనీ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కంభం మండలం నాయకులు సందు నారాయణ, నల్లబోతుల మస్తాన్, ఇట్టె విశ్వనాథ్, పిక్కిలి కాశయ్య, నళ్ళబోతుల అనిల్ కుమార్, అనంత రాయుడు, నళ్ళబోతుల భరత్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-1.50.13-PM-1024x461.jpeg)