రాజవొమ్మంగి మండల జనసేన క్రియాశీలక సభ్యులతో సమావేశం

రాజవొమ్మంగి మండల క్రియాశీలక సభ్యులతో మండల అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాడుచేయడం జరిగింది. మండలంలో గల 19 పంచాయతీలలోవున్న అన్నిగ్రామాలలో జనసేనపార్టీని బలోపేతం చేయడానికి ఏవిధంగా ముందుకువెళ్లాలనే కార్యాచరణని సభ్యులందరు కలిసి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్బంగా బొదిరెడ్డి త్రిమూర్తులు మాట్లాడుతూ పార్టీకోసం పనిచేసే జనసైనికులందరికి స్థానముండేల త్వరలోనే పూర్తిస్థాయిలో మండలకమిటిని ఏర్పాటు చేస్తానన్నారు. అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరి గంగులయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు జనసైనికులుగా ఉన్న అందరూ కూడా ఇప్పటినుండి జనసేన నాయకులుగా ఎదగాలని, అలానే జనసైనికులకు ఎప్పుడూ తను అందుబాటులోవుంటానని చెప్పుతూ విధివిధానాల గురించి మాట్లాడడం జరిగింది. మండలంలో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అందరుకూడా ముందు ముందు జరగబోవు అన్నికార్యక్రమాలలో పాల్గొని జనసేనపర్టీని బలోపేతం చేయవలసిందిగా నాయకులు కోరటం జరుగుతుంది.