అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్నిచ్చిన జనసేన
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్ తాండవపల్లి గ్రామంలో అగ్నిప్రమాదంలో దగ్ధమయిన 3 ఇళ్లని పరిశీలించి బాధిత కుటుంబాలను
జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, యాళ్ళ నాగ సతీష్ పరామర్శించారు, బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున తాండవపల్లి జనసైనికులు, మండల అధ్యక్షులు పండు, యాళ్ళ నాగ సతీష్ అధ్వర్యంలో 35వేల రూపాయల నగదును బాధిత కుటుంబాలకు అందచేశారు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుందని బాధిత కుటుంబాలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లా వెంకటేశ్వరరావు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, తిక్కా సరస్వతి, పరమట చిట్టిబాబు, కొలిశెట్టి తాతాజీ, పాలూరి స్వామి నాయుడు, చిందాడగరువు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా రవి మరియు తాండవపల్లి గ్రామ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-06-at-7.07.13-PM-1-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-06-at-7.07.15-PM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-06-at-7.07.14-PM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-06-at-7.07.13-PM-1024x470.jpeg)