మత్యకార అభ్యున్నతి యాత్ర విజయవంతం చేయాలి
*జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ
జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మత్యకార కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 20వ తేదీన నరసాపురంలో మత్యకార అభ్యున్నతి సభ నిర్వహించనున్నారని ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ విజ్ఞప్తి చేసారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ సూర్యారావు పేట (లైట్ హౌస్) నుండి మత్యకార అభ్యున్నతి యాత్రను పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పారంభిస్తారని తెలిపారు. 13,14 తేదీల్లో రెండు రోజులు పాటు ఈ యాత్రలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో భేటి కానున్నారని తెలిపారు. నియోజకవర్గ నలుమూలల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు విచ్చేసి ఘన స్వాగతం పలికి, ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు సూర్యాపేట నుండి యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. సోమవారం ఉదయం 9.00 గంటలకు కాకినాడ రూరల్ ప్రాంతం మహాలక్ష్మి నగర్ అర్చ్ దగ్గర నుండి మహాలక్ష్మి నగర్, డ్రైవర్స్ కొలనీ, పగడాల పేట ప్రాంతాల పర్యటన ఉంటుందని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-2.03.35-PM.jpeg)