జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయండి

తూర్పుగోదావరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల 20న నరసాపురంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి యాత్రను విజయవంతం కావాలని, అమలాపురం నియోజక వర్గ గౌరవ సలహాదారు నల్లా శ్రీధర్ పిలుపు నిచ్చారు. అమలాపురం ఆక్సిజన్ బ్యాంకులో జరిగిన సమావేశంలో నల్లా శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మత్స్యకారులకు సంఘీభావంగా చేపట్టే యాత్రను విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అమలాపురం పురపాలక కౌన్సిలర్ లు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను కౌన్సిలర్లు గొలకోటి విజయలక్ష్మి, పడాలశ్రీదేవి నానాజీ, జనసేననాయకులు కంచిపల్లి అబ్బులు, రాష్ట్ర నాయకులు, నాగ మానస, బట్టు పండు, జనసేన అమలాపురం మండలాధ్యక్షులు లింగోలు పండు, ఆకుల సూర్య నారాయణ మూర్తి, జనసేన నాయకులు వాకపల్లి శ్రీను, నీతిపూడి ధనలక్ష్మి, తిక్కా సరస్వతి, పోలిశెట్టి బాబులు, పరమట చిట్టిబాబు, దున్నాల వేణు, పోలిశెట్టి శ్రీను, డిఎస్ఎన్ కుమార్, పోలిశెట్టి కన్నా, గంగాబత్తుల కిషోర్, గుర్రాల కన్నా, వాకపల్లి వెంకటేశ్వరరావు, సత్తి చిన్నా, పడాల బాబులు, జంగా లోవరాజు, కానిపూడి రమేష్, నల్లా వెంకటేశ్వరరావు, గట్టెం వీరు, నల్లా శ్రీను, కందుల శివ, చిక్కం బాలాజీ, మెండా రమేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.