మనం జనం కలిస్తే జనసేన గెలుపు తథ్యం

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం బత్తి నాయుడు గిరిజన కాలనీ గ్రామం నందు చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు మరియు మండల నాయకులు రాఘవేంద్ర, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గడప గడపకు జనసేన సిద్ధంతాలు, మేనిఫెస్టో లను వివరిస్తూ అనంతరం తడ శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన కాలనీ లో ఉన్నటువంటి సమస్యలను అడిగితెలుసుకుంటూ గత కొద్ది రోజులుగా త్రాగు నీటి సమస్య ఉన్న స్థానిక సర్పంచ్ మరియు ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాకలాలు లేవు త్రాగు నీరు తెచ్చుకోవాలంటే 2 కి.మి దూరంలో ఉన్న పంటపొలాలలో ఉన్నటువంటి మోటార్ దగ్గర నుంచి తెచ్చుకుని త్రాగుతున్నారు ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం ఎలక్షన్ సమయంలో వచ్చి ఓట్లు వేసుకుని వెళ్లిపోవడం తప్ప ఈ ఈ గిరిజన కాలనీ లో పర్యటించిన దాకలాలు లేవు కావున ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గిరిజన కాలనీలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి అని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుగంధర్, కోదండరామయ్య, వీరరాఘవులు, తేజ, వసంత రావు, ఆనంద్, ఆగస్టిన్, శ్యాం, అమృత్ తదితరులు పాల్గొన్నారు.